1950 వ సంవత్స్రరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రేడియోలో ' వక్తృత్వము - శ్రోతల మనస్తత్వము ' అనే విషయం మీద చేసిన ప్రసంగంలో శ్రోతల్లో రకాల గురించి, వారి మనస్తత్వాల గురించి, వారి మధ్యన ప్రసంగం చేసే వక్తల ఇబ్బందుల గురించి హాస్య, వ్యంగ్య ధోరణిలో వివరించారు. ఆ ప్రసంగపాఠం నుండి కొన్ని భాగాలు.......
ఏ రాజో, చక్రవర్తో రాజ్యాల్ని పాలించేటప్పుడు ప్రజల హక్కులనీ, కష్టసుఖాలనీ, మరేదో అనీ ఆందోళనలు చేయడానికి కాని, ఆవేశాలు కలిగించడానికి కాని అవసరమూ ఉండేది కాదు, అవకాశమూ ఉండేది కాదు.
మన భారత దేశంలో దాదాపు నూరేళ్ళనుంచి మహావక్తలు పుట్టుకొచ్చారు. ఇలా రావడానికి కారణం ఇక్కడ రెండు మూడు మహోద్యమాలు పుట్టి విజృభించాయి. సంఘ సంస్కరణోద్యమం, మత సంస్కరణోద్యమం, భారత స్వాతంత్ర్యోద్యమం - మూడు ఉద్యమాలూ ప్రజలకు సంబంధించినవే.
అయితే దాదాపు ముఫ్ఫయి ఏళ్ళక్రితం దాకా మధ్య తరగతి అక్షరాస్యులే ప్రజ అన్నమాట. అంటే నా అభిప్రాయం సభల్లో, సమావేశాల్లో వాళ్ళే లెండి ఉండేవారు. వాళ్ళే శ్రోతలు, కనుక వక్తల ప్రసంగాలలో కూడా ఒక హుందా, ఒక పెద్దమనిషి తరహా ఉండేవి.
గాంధీ యుగం వచ్చాక ప్రజాబాహుళ్యం సభలు వచ్చాయి. గాంధీ ఉద్యమంలో మంచి వక్తలూ వచ్చారు.
సభలకు హాజరయ్యే వాళ్ళలో ఎన్ని రకాల వాళ్ళున్నారండీ ! ఎన్నెన్ని మానవ ప్రకృతులున్నాయో అన్ని రకాల శ్రోతలూ ఉంటారు కదూ !
అయిదు గంటలకు ప్రారంభమయ్యే సభకు నాలుగు గంటలకే వచ్చే భక్తుడున్నాడు. ఇతగాడు పెద్దమనిషి. ప్రతీ సభకూ కూడా ఎవరు మాట్లాడినా సరే, ఏ విషయాన్ని గురించిన ప్రసంగమయినా సరే ఈయన వేంచేసి తీరుతాడు. అంతే కాదు అది ఎలాంటి ఆముదపు ప్రసంగమయి ఊరుకున్నప్పటికీ ఈ మంచివానికి బాగుండి తీరుతుంది.
ఇతగాడు మళ్ళీ మూడు నాలుగు రకాలు :
రాగానే ముందు పంక్తిలో కూర్చుండి, సూటిగా అప్పణ్ణుంచే వేదిక వైపు వక్త నిలబడవలసిన చోటుకేసి చూపులను గుచ్చి చూస్తూ, నవ్వూ త్రుళ్ళూ లేకుండా సభాంతందాకా కూర్చుండే రకం ఒకటీ: ఈయన నిజానికి ఉపన్యాసం వినడు. మంఛివాడు. మనస్సు ఖాళీగా కూడా ఉంటుంది, మొదటా చివరానూ ! సభకు రావడం పురుషలక్షణం కనుక వస్తాడు.
ఉపన్యాసం ప్రారంభం మొదలుకొని అంతం దాకా, పెదవులు రెండు చెవులదాకా, విశాలమైన నవ్వుతో, చప్పుడు చెయ్యని నవ్వుతో - చిరునవ్వే అది - అలాంటి నవ్వుతో సాగదీసి తానూ, వక్తా, విషయమూ, లోకమూ అంతా మంచివి కనుక తాను ఎంచక్కా ఒప్పుకున్నట్టు కనబడే రకం మరొకటి. ఈ రబ్బరు రకం మొదటి రకానికి తమ్ముడు.
ఉపన్యాసం ప్రారంభించీ ప్రారంభించడంతోనే కుర్చీ ఉంటే దాని అంచునీ, క్రింద అవుతే ఒక కాలు అడ్డంగానూ, ఒక కాలు నిటాగ్గానూ మడిచి మడతగా ముందుకి ఒరిగిన్నీ, మరీ మంచి సంగతి వచ్చినప్పుడు ఉత్సాహంతో అవసరమైతే ముందుకు దూకడానికిలాగా కూర్చుని, అప్పుడూ ఇప్పుడూ పేలవమయిన చోట ' వినండి వినండి ' అంటూ, హాస్యం లేని చోట ఫెడీలుమని నవ్వుతూ, తానే దగ్గరుండి వక్త చేత ఉపన్యాసం ఇప్పిస్తున్నట్లూ, తానూ వక్తతో ఏకీభవిస్తున్నట్లూ తొండలాగ తల పంకిస్తూ సందడి చేసే నరాల పట్టులేని వొడుదుడుకు రకం ఒకటి ఉంది.
ఇంకో జాతి శ్రోత ఉన్నాడు. అరుదుగానీ ఉన్నాడు. అక్కడక్కడా కనిపిస్తుంటాడు. ఇతగాడు చిన్న నోటు బుక్కుతో, పెన్సిల్ తో వస్తాడు. ప్రసంగం వింటూ వింటూ రివ్వున నోటు బుక్కూ, పెన్సిల్ తీసి దానిలో ప్రసంగంలోని మహద్విషయమో, వాక్యమో వ్రాసేసుకుంటాడు, మహా జ్ఞానతృష్ణ ఉన్న విద్యార్థిలాగ. ఆ పుస్తకం నెమ్మదిగా లాగి చూస్తే ఎందరివో, ఎన్ని ఉపన్యాసాల తాలూకువో వ్రాసి వుంటాయి. అయిన తారీకు, వక్త పేరు, ఉపన్యాస విషయమూ కూడా ఉటంకింపబడి ఉంటాయి. అయితే దానిలో వ్రాసి ఉన్నవేవీ వ్రాసిన వాడికీ, ఇతరులకీ కూడా తెలియవు.
వీళ్ళతో ఇంకొకడున్నాడు. వక్తకు స్నేహితుడు. అనుయాయి. మెచ్చుకునేవాడు. ఉపన్యాసం సాగుతుంటే కళ్ళు ఉల్లాసంతో మెరిపిస్తూ, ఇటూ అటూ ఇతర సదస్యులవైపు " నేను చెప్పాను గదూ ముందే " అన్నట్లూ " ఎవరికోసం ఒప్పుకుంటారండీ చచ్చినట్లు " అన్నట్లూ, " అయిందా మీ పని " అన్నట్లూ చూస్తూ ఉపన్యాసం చివరని వక్త పక్కకి దూకి ఇట్టే అంగరక్షకుడు లాగ నిలబడుతూ, ఆటోగ్రాఫ్ హంటర్స్ ని సర్ది జాగ్రత్తగా ఆర్డరులో పంపుతూండేవాడు.
ఈ శ్రోతలందరూ వక్త స్నేహితులు - పురాణ కాలక్షేపం రకం, రబ్బర్ నవ్వు రకం, తొండ రకం, నోటుబుక్ రకం, అంగరక్షకుడి రకం.
మరికొన్ని జాతుల శ్రోతలున్నారు. వీళ్లతోనే పేచీ.
ఒక్కొక్క శ్రోత వస్తుంటాడు. ఇతగాడు ఉపన్యాసకునివైపు చూడడు. పక్కకి తల తిప్పి ఏదో చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంటాడు. " ఏదో మాట్లాడుదూ ! నేను వింటూనే ఉన్నాను. ఇలాంటివి చాలా విన్నాను కూడా ! " అని అనుకున్నట్లు వక్తకు అనిపిస్తాడు. ఇది గడ్డు జాతి. గడసరి జాతి. ఉపన్యాసం కాగానే తత్ క్షణం ఏమీ అనకుండా వెళ్ళిపోతాడు.
మరొక రకం శ్రోత ఉంటాడు. ఈ భయంకరుడే సూటిగా వక్త కళ్ళల్లోకి చూస్తూ, నవ్వూ త్రుళ్ళూ, తలపంకింపు ఏమీ లేకుండా కూర్చుని " నువ్వు చచ్చినా ఎంత వాగినా నేను మెచ్చుకోను తెలిసిందా " అన్నట్లు ఉంటాడు. ఇతని వైపు ఏమాత్రం తరుచుగా చూసినా ఉపన్యాసం నట్టుతుంది. ఇతగాడు లోకోత్తరుడు. అసాధ్యమైన తెలివితేటలు గలవాడు. మెచ్చుకుని తెలివి తేటలకు లోపం తెచ్చుకోడు.
ఇంకొక రకం గమ్మత్తు శ్రోత ఉన్నాడు. ఉపన్యాసకుడు వైపు చూస్తూ, పక్కన ఉన్న వాడితో ఏదో చెప్తూండడం, నవ్వుతూండడం చేస్తూ ఉంటాడు. ఉపన్యాసంలో ఆకర్షణ లేకపోతే, జిడ్డుగా ఉంటే, మరో విషయం తోచక పక్కవాడితో మాట్లాడుతున్నట్లు కనబడతాడు. ఒక్కొక్కప్పుడు మరొకరకం కంగారు కలిగిస్తాడు ఇతనే. వక్త కట్టులోనో, చొక్కాలోనో ఏదో నవ్వు పుట్టించేది ఉన్నట్లో, వక్త హమేషా తెలియకుండా ఒకటే మాటనో, ఒకటే చేయి ఊపునో, ఒకటే పెదవి చప్పరింపునో వాడుతున్నట్లో, అలా చెయ్యడం వలన వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నట్లో తోపిస్తాడు ఈ మహానుభావుడు. ఇతడిది చాలా అపాయకరమైన ధోరణి.
ఇక యుద్ధకాండపు శ్రోతలున్నారు. వీరిలో ధర్మ యుద్ధపు వాళ్ళూ, అధర్మపు దొంగతనపు చాటుమాటు నంగి నంగి యుద్ధం వాళ్ళూ ఉన్నారు.
అసలు యుద్ధాలలో లాగే ధర్మయుద్ధం వాళ్ళతో పోట్లాడి గెలవడమే తేలిక. వీళ్ళు అడ్డుసవాళ్ళు వేస్తారు. గర్జిస్తారు. హాస్యపు మాటలు విసురుతారు. ఇవేవీ రానివాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారు. వీళ్ళు నిజమైన వక్తకు ఉత్సాహమూ, వేడి కలిగిస్తారు - ముఖ్యంగా అడ్డు సవాళ్లు వేసేవాళ్ళు !
ఇక అధర్మయుద్దపు శ్రోతగారు. ఇతనికి ఎన్ని జంతువుల భాషలో వచ్చు. ఎన్ని రకాల వాద్య విశేషాలో నేర్చుకున్నాడు. కప్ప, కాకి, మేక, పిల్లి, శునక, గార్దభాదులు అన్నిటి అరుపులూ అచ్చంగా అలాగే వచ్సునితనికి. తరువాత సన్నాయి, ఈలపాట, బ్యాండు వాద్యమూ అన్నిటిలో దిట్ట ఈయన.
ఒకసారి వీటి సహాయం ఏమీ ఆపేక్షించకుండానే ఉపన్యాసం హుషారుగా సాగుతున్నప్పుడు నిశ్శబ్ద సదస్యలోకం లోనుంచి ఒక్క మూలుగు - రోకలి బండలాగ, పాములాగా మన నరాల ద్వారా మెదడులోకి పాకి, తిరిగి నరాల ద్వారా ఒళ్లంతా నిండిపోయేది - ఒక్క మూలుగు మూలుగుతాడు. ఆది వక్తకు మృత్యువు లాంటిది.
అయితే ఇతనికన్నా శత్రువు ఇంకొకడే ఉన్నాడు. ఇతను కూడా చల్లగా చప్పుడు చేయకుండా వింటూన్న సభ్యకూటంలోనుంచి హఠాత్తుగా గట్టిగా ఆవులిస్తాడు. వక్త అంటే గిట్టకకాదు. పరధ్యానంగా, అంటే ఏ ఇంటి గొడవో ఏదో ఆలోచించుకుంటాడో ఏమో. ఇతన్ని ఎలా ఎదుర్కోవడం చెప్పండి వక్త ?
ఎంత గడిదేరిన వక్త అయినా గద్దేమీదకి ఎక్కేముందూ, ఎక్కిన రెండు నిముషాలదాకానూ లోపల గుండె పీచుపీచుమంటూ ఉంటుందనుకుంటాను. వేయిమందితో కర్రతో చెడీ యుద్ధం చేయవలసినవాడు వక్త. మెదడుతో ఉప్పట్టీ, చేడుగుడూ, కుండ బంతీ, కోతి కొమ్మచ్చీ అంచీలమీద ఆడగలిగే నేర్పరి వక్త.
................ ఇంకా ఇన్ని రకాల శ్రోతలను ఆకట్టుకుని ఉపన్యాసాన్ని ఎలా రక్తి కట్టించాలో కొన్ని సూచనలు కూడా చేస్తారు ఈ ప్రసంగంలో దేవులపల్లి వారు.
ఈ వ్యాసాన్ని అందించినవారు శిరాకదంబం బ్లాగర్ రామచంద్రరావుగారు. ధన్యవాదాలు రావు గారు.
నన్నసలు కదిలించ వద్దు. పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాను. Except on emergencies, don't even try to message me. అని గట్టిగా అందరికీ వార్ణింగిచ్చి, ఏమన్నా B&G వ్యవహారాలుంటే నువ్వే చూసుకో, అని ధన కి అప్పగించాక ఓ రెండు గంటల క్రితం వరకూ నాకే డిస్టర్బెన్స్ లేదు. ఇందాకన హట్ఃఆత్తుగా నా ఫోన్ మ్రోగుతుంటే చాలాసార్లు కట్ చేశాను. ఇక లామ్భం లేదనుకున్నాడో ఏమో, మెస్సగెన్ పెట్టాడు ధన, Veturi died. Shall we post anything అని.
ఏమి చేద్దాము? సంతాపం తెలుపుదామా? అందరూ చేస్తున్నదదే కదా! అయినా వయసు దాటిపోయింది. మాట కూడా సరిగ్గా రావటం లేదు, అని ఈ మధ్యే కదా అనుకున్నది. మనిషిని మనం మిస్సవుతాము నిజమే కానీ, దానికి బాధ పడటమంటే ఆ మనిషిని అవమానించటమే (అదెలాగో మా మోటార్సైకిల్ డైరీస్ లో చదువుదురు).
నువ్వు నీ స్టైల్లో చెపుతావు సరే. అదందరికీ అర్ధం కాదు కదా. నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు అన్నాడు.
ఆయన వల్ల నాకు తెలిసిన సత్యాన్నో, జరిగన మేలునో, లేదా నన్ను ఇన్స్పైర్ చేసిన అంశాన్నో అందరికీ చెపుదాము. అదే ఆయనకు నివాళి. మనిషి లేడని బాధ పదటం కాదు. ఆ మనిషి లెగసీని (తెలుగుభాషాభిమానీస్ ఎవరన్నా ఉంటే నా భాషకు అభ్యంతరం చెప్పుద్దు. అది నా సహజమైన భాష. వాడుకలో ఎక్కువ ఆంగ్ల పదాలు దొర్లుతుంటాయి. అవసరమైన సందర్భాల్లో ఒక్క ఆంగ్ల పదం లేకుండా కూడా వ్రాయగలను)
సరే ఆలోచిస్తే ఒకటనిపించింది. వేటూరంటే నాకు గుర్తొచ్చేది ఒకే పాట. అది అర్జున్ సినిమాలోని సంభవామీ పాట. అందులోనూ, మనసు ఉంటే మార్సు దాకా మార్గముందీ చలో (చూశారా సందర్భాన్ని బట్టీ ఆయనా అలాగే వ్రాశారు ;-)) అన్న మాటలు నాకు బాగా నచ్చినవి. అందుకే ఆ పాటను ఇన్స్టెంట్ నివాళిగానూ, నాకు తీరుబాటయ్యాక ఈ పాట గురించిన పెద్ద ఎనాలిసిస్ తో ఇంకా పెద్ద నివాళినీ అర్పిస్తాను.
*** *** ***
సంభవామీ సంభవామీ
సాగరాలే దాటిపోనీ
అంబరాలే అంటుకోనీ
సంభవామీ
ఒక్క మాటా ఒక్క బాణం ఒక్కటేలే గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే ఝరి - ఝరి
ఓటమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనసు ఉంటే మార్సు దాకా మార్గముంది చలొ
చల్రే చలొ చల్రే చలొ
చల్రే చలొ చల్రే చలొ
free ur mind free ur soul
see what u find and take control
high high through the sky through the sky fly high
through the sky fly
through the sky fly high fly
one word one shoot
i am here to stay
చుక్కలు దించెయ్ చక చకా
హక్కులు మనవే పద పదా
రెక్కల గుర్రం ఎక్కిపో
ఆ గగనాన్నే ఏలుకో
స్వాగతం అనదినం గీతికా
జాబిలికే కధచెపుదాం
వెన్నెలతో జతకడదాం
సాహసం చెయ్యర ఇంకా ఢింబకా
చినుకులనే జోడిద్దాం
చేడుగుడునే ఆడేద్దాం
ఆకాశంలో భూకంపాలే సంభవం
సర్వం నీకే సంభవం
రోధసీ నీ ప్రేయసే లే
పరుగులు పెట్టే గంగను ఉరికే కృష్ణ తొ కలపరా
నదులే కాదు యదలను కలిపేస్తేనే గేలుపురా
జీవితం equatorలొ స్నేహితం
స్వరములతో జతకడదాం
శరములతో గురిపేడదాం
యవ్వనం is equal to అద్భుతం
మనసల్లే పరిగెడదాం
మనిషల్లే నిలబడదాం
వేగం వేగం అంతా వేగం సంభవం
సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేయసేలే
*** *** ***
వేటూరి ఫొటో పెడదామని వెతికితే గూగుల్లో మంచివి, అంటే నాకు నచ్చినవి, దొరకలేదు. అందుకో వేరే ఏదో బ్లాగులో ఈ పాట స్కాన్ దొరికింది. మనిషి కన్నా ఆ మనిషి లెగసీ ఎక్కువనుకున్నాం కదా. :D అందుకే ఆయన వ్రాసిన పాట బొమ్మనే ఇక్కడ పెట్టేద్దాం అనుకున్నా. ఇక ముందు కనబడని ఆయన రూపమెందుకు? శాశ్వతమైన ఆయన పాట ఉండగా.
పిక్చర్ మీద బ్లాగడ్రస్సు ఉంది. ఆ బ్లాగు వారికి ధన్యవాదాలతో...
"నేను మేస్టర్ని. ఎం. బీ. ఎస్ ప్రసాద్ కి కేవలం ఫస్ట్ క్లాస్ కాక డిస్టింక్షన్ ఇస్తున్నాను" అని కవన శర్మ గారు చెప్పిన ముందుమాటే చాలు ఈ పుస్తకం విలువ చెప్పడానికి. ఆంగ్ల సాహిత్య అభిమానుల్లో పీ. జీ. ఉడ్ హౌస్ నీ, అతని రచనలలో వెల్లి విరిసే సున్నితమైన, విభిన్నమైన హాస్యాన్నీ ఎరుగని వారు ఉండరు. ఇద్దరు ఉడ్ హౌస్ అభిమానుల (శర్మగారూ, ఈ పుస్తక రచయత ఎం. బి. ఎస్ ప్రసాద్ గారూ) సాహిత్య చర్చలు ఒక ముఖ్య కారణంగా ప్రసాద్ గారి కలం నుంచి వెలువడి, ఎంతో ప్రాచుర్యం పొందిన రచనలు ఇవి. ' అచలపతి కధలు ఎంత బావుంటాయో, రాంపండు లీలలు కూడా అంతే బావుంటాయి. జీవ్స్, వూస్టర్ పాత్రల స్పూర్థితో 'అచలపతి కధలూ ఎందుకు రాసారో రచయత ఈ పుస్తకం ముందు మాటలో చెప్పారు, అవి ఉడ్ హౌస్ అభిమానులకి కూడా నచ్చడం పట్ల సంతోషం వెలిబుచ్చారు కూడా. ఆ సునిశితమైన హాస్యం అందరికీ అందాలనే ఉద్దేశ్యంతో మరొక రెండు, మూడు పాత్రలని కలగలిపి తయారు చేసిన పాత్రే మన హీరో రాంపండు. ఈ పుస్తకం లో ఉన్న పదిహేడు కధలూ, చిత్ర విచిత్రం గా సాగే అతని ప్రేమ లీలలు.
సూర్యుడు ఒక దేశంలో అస్తమించినా మరొక దేశంలో ఉదయిస్తూనే ఉంటాడు. అచ్చం మన రాంపండు ప్రేమ లాగే. అతని ప్రేమ కి ఆది, అంతం లేదు. అది అనంతంగా సాగుతూనే ఉంటుంది. అనంత్ అనబడే అనంత శయనానికి ప్రాణం మీదకి తెస్తూనే ఉంటాయి. రాంపండు కి ప్రేమించడం తప్ప వేరే పనేమీ లేదు. ఎందుకంటే నెల నెలా పాకెట్ మనీ ఇచ్చే బాబాయి ఉన్నాడు కనక అందరిలా ఉద్యోగం లాంటి మామూలు వ్యవహారాలు పెట్టుకోడు. అతనో ఏకలవ్యుడు అంటే ఒకసారి ఒక్కరినే ప్రేమిస్తాడు, ఎవరిని ప్రేమించినా అది పాపం అతని బాల్యమిత్రుడైన పాపానికి అనంతంగా శయనించే (అంటే పనీ పాటా లేదని అర్ధం) అనంత శయనం మెడకే చుట్టుకుంటుంది. అది ప్రేమకధని విజయవంతం చెయ్యడానికే మొదలయినా, చివరికి అభాసుపాలుగానే ముగుస్తుంది. ఈ ప్రయాణంలో రరకాల సంఘటనలూ, సన్నివేశాలూ.. నవ్వుల వానలో తడిపేస్తాయి.
'తా వలచింది రంభ' అన్నది పాత నిజమే.. అది రాంపండు విషయంలో మరింత నిజం.. అందుకే అందరికళ్ళకీ షాండోలా కనబడే షాలిని కూడా అతనికి లతాంగిలాగానూ, పరమపాతకాలపు పేరైన సుబ్బి కూడా ముగ్గులో గొబ్బిలాగానూ కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ప్రతీ కధలోనూ రాంపండు విధిగా ఎవరో ఒక అమ్మాయితో తలమునకలు అయ్యేటట్లు ప్రేమలో పడటమూ, దానిని సఫలం చేసే బాధ్యత అనంతు మీద అతని ప్రమేయం లేకుండా పెట్టడమూ ( నీకంత బుర్ర ఎక్కడ ఏడ్చిందిలే? నువ్వంటే అచలపతి అని అంటూ మరీ), అచలపతి సలహాల వల్ల అనంతు వాటిల్లోంచి బయట పడటమూ హుషారుగా జరిగి పోతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో అనంతు ఒకసారి ప్రేమకధలు రాసే కల్పనారాణీ అవతారం ఎత్తవలసి వస్తే (రాంపండూ- పెసరట్ల సుబ్బీ), మరొకసారి రాంపండు ని హీరోలా చూపించడానికి తనే అతని ప్రేమికురాలి తమ్ముడుని నీళ్ళల్లో తోసేయ్యడం (రాంపండూ-షాండో షాలినీ), అతను ప్రేమించిన అమ్మాయిని, తన ఇంటికే భోజనానికీ, టీ కీ పిలవవలసి రావడమూ, ఆ 'వాలెంతింటా' అది తింటా, ఇది తింటా అంటూ అతని బుర్రతో సహా తినడమూ (కామ్రేడ్ రాంపండు). అంతే కాక కవిత్వపు పందాలూ, ఆటల పోటీలూ, వాటిల్లో ఎదురయ్యే పందాలూ, పరాభవాలూ ఒక ఎత్తు అయితే.. రాంపండు కి తెలిసిన వాళ్ళతో తను తిట్లూ, మైదా పిండి తలకి పోయించుకోవడమూ ( రాంపండూ- హెడ్మాస్టారూ), ఐస్ దిండు తో తడిసిన పక్కమీద పడిన అవస్థలూ,(రాంపండూ- ఐస్ దిండూ), శునకదానాల పేరిట కుక్కలని కాపలా కాయడమూ, కావలసినప్పుడు మార్చడమూ (రాంపండూ- శునకదానమూ) లాంటివన్నీ మరొక ఎత్తు. ఈ మధ్యలో సింపుల్ గా ఒకరు తలుపుకొట్టి వచ్చిన వారి ధ్యాస మళ్ళిస్తే మరొకరు లోపలకి వెళ్ళగలిగే అవకాశం ఉన్నచోట, అక్కరలేని పూలకుండీల ఉపాయాలూ (రాంపండూ- రెసిడెన్షీల్ స్కూలూ), ఇలా రకరకాల సరదా కధలమధ్యన సమయం తొందరగా కరిగిపోతుంది.
ఇలా సుబ్బీ, షాండో షాలినీ, సులోచనా, వాలెంతింటా, సుమనోహరీ, వీణాపాణీ, కోకిలలని వరసగా ప్రేమించిన రాంపండు చివరికి అనుకోని పరిస్థుతుల్లో ఊహని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇన్నాళ్ళూ "ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా వీడు ప్రేమిచడమూ అది నా పీకకి చుట్టుకోవడమూ" అని చిరాకు పడే అనంతు ఊహతో అతని పెళ్ళి జరిగిందని తెలియగానే ఎగిరి గంతేస్తాడు. తన బాబాయి ఈ పెళ్ళిని ఆశీర్వదించేట్టు చెయ్యమని ప్రాధేయపడితే జాలి పడి అతనిని కలుస్తాడు. ఊహే అసలు కల్పనారాణి అని షాకింగ్ నిజం తెలియడమే కాక, ఆవిడ రాంపండు బాబాయి మీదా, తన మీద పరువు నష్టం దావా కూడా వేసే పరిస్థితి రావడం తో మరో దారి లేక అచలపతి దయవల్ల మతిస్థిమితం లేనివాడిగా ముద్ర వేయించుకోవలసి వస్తుంది పాపం అనంతుకి. అనంతుతో కలిసి కల్పనారాణి డ్రామా ఆడినందుకు రాంపండు పాకెట్ మనీ అలవెన్స్ కట్ అయిందని వేరే చెప్పక్కర్లేదు.. ఇలా పాపం రాంపండు ప్రేమే కాక పెళ్ళి కూడా అనంతు ముప్పుకే రావడంతో ఆఖరు కధ ముగుస్తుంది.
కధల్లో ఉన్న చమత్కారాలూ, ఉడ్ హౌస్ తరహా సంభాషణలూ, చమత్కార బాణాలూ కధల్ని వదలకుండా చదివిస్తాయి. ఈ తరహా హాస్యం తెలుగు పాఠకులకి అంత పరిచయం లేకపోయినా, కొత్తగా, సుతిమెత్తగా హాయిగా ఉండి అలరిస్తాయి. ఈ మూడు ముఖ్య పాత్రలూ, రాంపండు ప్రియురాళ్ళ పాత్రలే ,కాక మధ్యలో వచ్చిపోయే అత్తయ్యలూ, వారి స్నేహితులూ, వారి పిల్లలూ ఇలా అనేక పాత్రలు మనల్ని పలకరించి వారివంతు హాస్యాన్ని చిలికించి వెళతాయి.
'మొగుడు పారిపోయినా పర్వాలేదు కానీ పనిమనిషి పారిపోతే మాత్రం మళ్ళీ దొరకదు" అని వంట మనిషి భీమారావు ని పణంగా పెట్టడం గురించి చెప్పే ఉషారత్తయ్యా ఎప్పుడైనా అవలీలగా స్టమక్ లైనింగ్ గురించి మాట్లాడేసే కామేశం బాబయ్యా, చిన్నదెబ్బసాయంతో క్షతగాత్రుడినంటూనే అన్ని కులాసాలూ జరిపించుకునే ఫల్గుణుడూ.. వీటిల్లో కొన్ని.
చదవగానే పకపకా నవ్వించేది హాస్యంలో ఒకరకంగా అలరిస్తే.. సున్నితంగా చక్కలిగిలులు పెట్టే ఈ సునిశితమైన హాస్యం మరొకరకంగా మనల్ని మురిపిస్తుంది. ప్రసాద్ గారి శైలి గురించి కానీ, ఆయన కలానికున్న పదును గురించి కానీ, అది చేసిన, చేస్తున్న ప్రయోగాలని గురించి కానీ నేను కొత్తగా, ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు.. అందుకే శ్రీ కవనశర్మ గారు చెప్పిన రెండు మాటలు చెప్పి ముగిస్తాను. "ఈ రచనలు మనల్ని ఆసాంతం చదివిస్తాయి, అలరిస్తాయి. కొని చదివినందుకు సంతోషిస్తాం. కనక మీరు కొనవచ్చు అని సిఫార్సు చేస్తున్నాను" అన్నారు.
"కధలకీ, కధనానికీ అతికినట్టుగా ఉన్న ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి వేసిన బొమ్మలు కూడా ఈ పుస్తకానికి హైలైట్ గా నిలుస్తాయి. శ్రీ బాపూ రమణలకి అంకితమిచ్చిన ఈ పుస్తకం విశాలాంధ్ర వారిచే ప్రచురించబడింది.
ఈ పుస్తక సమీక్షను రాసినవారు ప్రసీద పేరుతో మనసు పలికే అని బ్లాగుతూ , కౌముదిలో అగ్రహారం కధలతో అందరి మనసు దోచుకున్న డా.సుభద్ర వేదుల
Iది కొంత మందికి తెలిసిన నా పాత బ్లాగు కాదు. చాలా రోజుల క్రితం నేను వ్రాసుకున్న టపా. అలాని రిపీటింగూ కాదు.
ముందు ఈ ఆకుపచ్చని అక్షరాల్లో ఉన్న దాన్ని చదవండి. తరువాత అసలు విషయం చెపుతాను... :-)
John Galt! Ayn Rand సృష్టించిన characters లో అద్భుతమైనదీ, ఆసక్తికరమైనదీ. అసలింతకీ ఎవరీ John Galt? ఎందుకితనికి అంత ప్రాధాన్యం?
దీనికి సమాధానం...
John Galt ఒక నిరంతర సత్యాన్వేషి. అతని మోటో... "I will never live for the sake of another person, nor ask another person to live for mine."
The world is open to us, and we oughtta explore it.
Moreover, he is The rational being. The truth finder.
Live 'In the Name of the Best Within Us' అని చెప్పగలిగిన గొప్ప సాహసి. తనని తానే మలచుకున్న నిత్య తాపసి.
Note: I thank Srujana for acquiring those articles, and also for the Atlas picture
ట.
ఇంటర్నెట్ లో ఏదో వెతుకుతుంటే ఇది కనిపించింది. కాస్త అందరితో పంచుకోవాలనే ఆత్రం, అలాగే ఈ పుస్తకాలను గురించి వ్రాయటానికి కాస్త రిమెయిన్డెర్ లాగా ఉంటుందనీ. అయితే ఈ లిస్టు తో నేను ఒప్పుకుంటానా అంటే... నాకు కొన్ని అబ్జెక్షన్లున్నాయనే చెప్పాలి. కాకపోతే ఒక పెద్ద లిస్టు. అంతే.
మరి దీని పైన మీ అభిప్రాయం, అలాగే మీకు నచ్చిన పుస్తకాల గురించి ఇక్కడ పంచుకుంటారని అనుకుంటున్నాను.
గీతాచార్య
డాక్టర్లు చాలా మంది లలిత కళలను ఆరాధించే సృజనకారులే. విశ్రాంతి లేని జీవితం. అయినా ఎందరో రచయితలు, చిత్రకారులు ఉన్నారు వారిలో. నిజానికి ఈ సృజనే వారికీ విశ్రాంతి నిచ్చే మానసిక వ్యాపారం కాబోలు. ఈ కోవలోకే చేరుతారు డా. పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారు. నాలుగు దశాబ్దాల నిరంతర సాహితీ వ్యాసంగంగా విస్తరించిన ఆమె ఇప్పటికి ఎనిమిది నవలలు, అయిదు నవలికలు, నాలుగు కవితా సంపుటాలు, తొమ్మిది కధా సంపుటాలు వెలువరించారు. అయితే కథయిత్రి( కథారచయిత్రి ) గానే ఆమెకు మంచి పేరుంది. కవయిత్రి కావడం వల్ల ఆమె కథల్లో భావుకత, కవిత్వ మనిపించే వాక్యాలు అక్కడక్కడ అలరిస్తాయి. వివిధ పత్రికల్లో వచ్చిన పద్నాలుగు కథలను ' నక్షత్రం' పేర ఇటీవల సంపుతీకరించారు డా. జయప్రద.
డాక్టరు గారి కథల్లో వస్తువు సామాజికం. కథనం వైద్యురాలి దృక్పథం - వెరసి సామాజిక చికిత్సే ఇతివృత్తం. అందుకే సామాజిక చికిత్స చేస్తున్న సాహితీ వైద్యురాలీమే. వైద్యురాలు కావడం వల్లే రాయగలిగినవి కొన్ని కథలు కథయిత్రి అయిదేంటిటీని పట్టిస్తాయి. ఇతివృత్త మేదైనా ఒక మానవీయ స్పర్శతో చర్చించే సామాజిక సమస్య పరిష్కార దిశలో పరిణమించే అక్షరాలు, రాశీభూతమైన భావాలు, భావనలు ఈమె కథలు.
సంపుటికి శీర్షికైన కథ 'నక్షత్రం'. కథ సామాన్యమైనదే అయినా, కథనం అసామాన్యం. మరొకరి జీవితం కోసం ఖర్చు పెట్టే కాసులు వాళ్ళకే కాదు, ఖర్చు పెట్టిన వారికీ ఆనందపు రుచిని చూపిస్తాయని చాటి చెప్పే కథ. వేలాది లక్షలాది మంది పేద పసివాళ్ళ లో ఎవరు నక్షత్రాలని తాకగలరో తెలుసుకోకుండానే వారి భవిష్యత్తు మొగ్గలోనే సమాధి అయిపోతుంది.అలాంటి ఒక నక్షత్రమే కన్నడు. చదువు కోసం వాడు పడుతున్న ఆరాటాన్ని చూసి వాడి గుడిసె ఎదుట మేడలో ఉండే యశోద స్పందిన్స్తుంది. వాడిని చదువులో పెడితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆదాయం పోతుందనీ, నాయుడయ్య దొర అప్పు తీరడం ఆ మేరకు వెనుక బడుతుందని భావించిన కన్నడి తండ్రి తిరుపతికి ప్రతి సంవత్సరం ఆ డబ్బిచ్చి కన్నడ్ని చదివించేందుకు ఒప్పిస్తుంది, యశోద. '' పుణ్యం కోసం పుష్కరాలకి వెళ్ళనవసరం లే''దనే సందేశంతో కథ ముగుస్తుంది. మనిషికి డబ్బు అవసరమే కానీ, దాన్ని మించిన ప్రాపర్టీ ప్రేమని చెబుతుంది, ' నెత్తుటి పండు' కథ.
మొదటి కథ ' ప్రేమంటే ఇదే' - భిన్న లైన్గికతలోనే ప్రేమ ఉండదనీ, ఇద్ద రాడవాళ్ళ మధ్య ఉండే అఖండ స్నేహం కూడా ప్రేమేనని తెలిపే కథ. డా. జయప్రద గారి కథల్లో స్నేహితురాళ్ళ పాత్రలు పరస్పరం స్నేహాన్ని మించిన ప్రేమను కనబరచుకుంటాయి. ఒక పాత్ర జీవితంలో సంతోషానందాల్ని కోల్పోయి ' డిప్రెషన్' చెందితే మరో పాత్ర సరిదిద్ది రక్షిస్తుంది. రెండు పాత్రల మధ్య స్నేహాన్ని మించిన ప్రేమ ఉండబట్టే అది సాధ్యమవు తున్దనిపిస్తుంది. స్త్రీ పురషుల మధ్య ఆకర్షణకు మాత్రమే సాధారణంగా వాడబడే పదం ప్రేమ. కానీ ఆలోచిస్తే అంతకు మించిన స్నేహాలన్నీ ప్రేమగానే పరిగణించబడాలని చెబుతాయీ రెండు కథలూ. ' విజేత' కథలో కూడా ఈ కోణం బలీయంగా కనబడుతుంది. ఒకరి కొకరు కావాలనుకోవడం ప్రేమయితే, ఏ అవకాశ వాదమూ, స్వార్ధ చింతనా లేని స్నేహం కూడా ప్రేమేనని కథాపూర్వకంగా నిరూపిస్తారు, డా. జయప్రద. మొదటి రకం ప్రేమలో ' నాది' అనే భావం, ' నా' సొంతం అనే అందమైన స్వార్ధం ఉండవచ్చు కానీ, రెండో దానిలో అది కూడా లేనటువంటి స్వచ్చత ఉంటుందని ' వీలునామా' కథ చదివినప్పుడు అర్ధమౌతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జీవిత భాగస్వామి హత్థాట్టుగా ఒంటరిని చేసేసి వెళ్ళిపోతే మిగిలిన భాగస్వామికి కావాల్సింది ఏమిటి? ఆస్తి పంపకాలా? మళ్ళీ సరికొత్త దాంపత్యమా? ఏ సుఖాలు?ఏ కన్నీళ్లు? ఏం కావాలి? ఇవన్నీ కావు; కావాల్సింది కాస్తంత ఏకాంతం. ఆ చనిపోయిన, విడిచిపోయిన జీవిత భాగస్వామి స్మృతుల్ని నెమరు వేసుకునేందుకు ఏకాంతమైన ఓ గుప్పెడు కాలం - అదీ కావాల్సింది.
అనుభవాల పాఠాల పరీక్షలో చాందసాలు ఓడిపోవలసిన్దేనని ' గ్రహణం' కథ చెబుతుంది. చాందసపు తల్లి దండ్రుల కారణంగా ఒంటరిగా మిగిలిపోయి సృష్టి ధర్మం ప్రకారం ఆకర్షణకు లొంగి పతనంలోకి దొర్లిపోయే ఆడపిల్లలు ఇకపై సమాజంలో ఉండకూడదన్నది ఇతివృత్తంగా ఈ కథ సాగుతుంది. ఎవర్నీ మార్చ లేనప్పుడు మనం మారడమే మన సంతోషానికి మనం ఇచ్చుకోగల పరిష్కారమని సందేశించే కథ ' డిప్రెషన్' - నక్షత్రం కథలానే మన ద్వారా గాని, మన డబ్బు ద్వారా గాని అవతలి వ్యక్తిలో మనం సంతోషాన్నీ, సంతృప్తినీ, కృతజ్ఞతనీ చూడగలిగినప్పుడు మనలో కలిగే ఆనందమే నిజమైన ఆనందమని ఈ కథ కూడా చెబుతుంది. ఈ మానవీయ కోణాన్ని డా. జయప్రద అవకాశం వచ్చినప్పుడల్లా పునః పునః చెబుతుంటారు.
స్త్రీ వాదం చర్చనీయంశ మైన కథ ' పరిమాణం'. స్త్రీ వాదమంటే సాధికారత కోసం పోరాటమే కాని ఆధిపత్యం కోసం కాదని చెబుతుంది. స్త్రీ వాదం కోరుకునే దేమిటి? హక్కుల పోరాటమా? సమానత్వమా? మగవాడిపై ఆధిపత్యమా? మరేమిటి? పురుషాహంకారపు కోరల్లో నలిగి, భర్తను వదలలేని నిస్సహాయతలో అతని ఆధిపత్యం ఓర్చుకోలేనటువంటి వ్యతిరేకతతో ఎందరి...ఎందరి స్త్రీల బతుకులు తెల్లారిపోతున్నాయి? ఈ అన్ని ప్రశ్నలకీ బాధ్యతతో కూడిన పరిష్కారం సూచిస్తుంది కథానాయకి. ఆ పరిష్కారమే - " సమస్యకి మూల కారణాన్ని వెతికి, వేరును తినేసే పురుగును ఏరి పారేయాలే కానీ వేరునే పెరికి వేయకూడ"దన్నది. ఎందుకంటే, " ఆ వేరు చాటున మానవ సంబంధాలు ఉన్నాయి...సంసారాలున్నాయి. భార్యా భర్తల్ని అల్లుకొని ఉన్న పిల్లల బ్రతుకులున్నాయి" కనుక. ఈ కథకు పేరు ' పరిణామం' అనుంటే ఔచిత్యంగా ఉండేదేమో!
శీర్షికను బట్టి ' లవ్ లెటర్' కథను ప్రేమోపాఖ్యానం అనుకునే వీలుంది.కానీ తల్లి కూతురికి రాసిన ఉత్తరమే ఇతివృత్తంగా రుపొందిందీ కథ.తల్లి ఉత్తరోపన్యాసం - కుమార్తె వివాహోత్తర ఉపన్యాసం. కూతురి పెళ్లి చేసాకా, అత్తవారింటికి సాగనంపి, ఉత్తరం ద్వారా వివాహపుటుత్తర జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో తెలిపే కథ. ఈ కథలో అమ్మ తన కుమార్తె దీప్తికి చెప్పేవన్నీ కుమారీ శతక నీతులకు తీసిపోవు. ఆ మాటే అంటే ఆమె అంటుంది - " కాలం ఏమైనా, అప్పుడైనా, ఎప్పుడైనా...మనిషికి కావాల్సింది మనశ్శాంతి... నీ మనస్సాక్షికి నువ్వు పదును పెట్టుకో! దాని మీదే నువ్వు ఆధారపడు" అని చెబుతుంది ఆ తల్లి.
ఓ డాక్టరు కోణం నుంచి వెలువడినవి 'సన్మానం', 'చీకటి', 'అజ్ఞానానికి మరో అంచు', 'గిఫ్ట్ బేబి' కథలు. డాక్టర్ల జీవితంలోని భిన్న కోణాన్ని వివరిస్తుంది 'సన్మానం' కథ. డబ్బుకు ఆశపడి డాక్టర్లు ఎటువంటి పనికైనా తెగిస్తున్నారని అనుకోవడం ఈ రోజు పరిపాటయింది. ఆఖరుకు పుట్టిన బిడ్డల్ని మార్చడం వంటి పనులైనా సరే. అయితే దాని వెనుక జరుగుతున్నదేమిటి? స్వార్ధపూరితమైన కొందరు న్యాయవాదుల ప్రమేయం అందుకెలా కారణ మవుతుందో చక్కగా చర్చిస్తుందీ కథ. వెంటనే ఆపరేషన్ చేస్తే కానీ బిడ్డని రక్షించలేమని డాక్టర్ చెబితే, డాక్టర్ల మీదున్న ఇటువంటి అభిప్రాయంతోనే పేషెంటు తల్లీ, అత్త, ఆఖరుకు భర్త కూడా ఆపరేషనుకు వెంటనే సమ్మతించక పోవడం, పరిస్థితి వికటించి లోపల చనిపోయిన బిడ్డని బయటికి తీసి తల్లిని రక్షించేందుకు అనివార్యంగా ఆపరేషన్ చేయాల్సి రావడం ఇతివృత్తంగా 'చీకటి' కథ నడుస్తుంది. చదువు లేకపోతే ఉన్న మెదడును వాడుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యమో తెలిపే కథ 'అజ్ఞానానికి మరో అంచు'. ఇతివృత్తంలో భిన్నమే అయినా, మౌలికంగా ఈ మూడు కథలూ ఒక బాధ్యతాయుతమైన డాక్టరు ఆలోచనాసరళిని వివరిస్తాయి. ఈ కథల్లోని సందర్భాలు బహుశా డా.జయప్రద గారి స్వీయానుభవాలు కూడా కావచ్చు. ప్రస్తుతం ' సైన్స్ పట్ల సంథియుగం' లో మనమున్నామంటూ, ఇదివరకు పేషంట్లు అజ్ఞానంతో ఉన్న కాలంలో వాళ్ళ విశ్వాసంలోనుంచి పుట్టిన ధైర్యంతో ఇవ్వాల్సిన ట్రీట్మెంటును సిన్సియర్గా, నిర్భయంగా ఇచ్చేవాళ్ళు డాక్టర్లు. కాని ఇప్పుడు పేషెంటు కాస్త అటూ ఇటూగా ఉంటే, ఆ పేషెంటుకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడవలసిన పరిస్థితి అంటారు డాక్టరు గారు. " పేషెంటుకీ డాక్టరుకీ మధ్య ఆ అజ్ఞానపు కాలంలో ఉండిన నమ్మకం - మరలా పూర్తిగా జ్ఞానం సంతరించుకున్నాకా గాని సంభవం కాదనే ఆశాభావాన్ని వెలిబుచ్చుతారు. కథయిత్రి డాక్టరు కావడం వల్లనే రాయగలిగిన కథ ' గిఫ్ట్ బేబి'.
కథన రీతికి వస్తే, పాత్రలను ఆత్మీయం చేసే పద్ధతులు కొన్ని అనుసరిస్తారు డా. జయప్రద. 'కోకిరాల జ్యోత్స్న' అని ఇంటి పేరుతో సహా పరిచయం చేయడం పాత్ర పట్ల ఒక ఆత్మీయతా భావాన్ని కలిగిస్తుంది. అమూర్త భావనలకి పరిమాణా న్నివ్వడం ఒకటి. ఆనందాన్ని సి.సి.లలో కొలుస్తారు. బలాన్ని మెగా లీటర్లలో సూచిస్తారు. డైనులూ, న్యూటన్లూ కాదని బలానికి మెగాలీటర్లు చెప్పడం అమూర్తానికి పరిమాణాన్నివ్వడమే. అలాగే ఉద్వేగాల్నీ, ఉద్రేకాల్నీ పరిమాణామాత్మకంగా వర్ణిస్తారు జయప్రద. దానినే చెబుతూ, ప్రముఖ కథావిమర్శక'విహారి' అంటారిలా - " జయప్రద గారి కథల్లో ఇతివృత్తాలు స్వీయానుభవం నుంచీ, జీవితాద్యయనం నుంచీ, ఆమె మానవీయ భావనల నుంచీ జనించినవి.ఆ కథల్లో పాత్రలన్నీ మనమెరిగిన మనుషులు. మానవ సహజమైన బలం, బలహీనత కలిగిన రక్త మాంసాలున్న జనం. వారి ప్రవర్తన లోకవృత్త సహజమైన మనుషుల వర్తన లాగానే సాగుతుంది. వారందరూ అందుకనే మనకు బాగా సన్నిహితులైపోతా"రంటారు. ఆందుకే డా. జయప్రద గారి కథా జైత్రయాత్ర జయప్రదంగా సాగుతోందని చెప్పుకోగలం.
ఐడియా ఏమిటంటే బ్లాగుల్లో వచ్చిన కొన్ని కొన్ని మంచి టపాల్ని, కవితల్నీ ఎంపిక చేసి, వాటిన VSAX పద్ధతి ద్వారా eBook గా మార్చిపరిచయం, సమీక్ష, విశ్లేషణ చేస్తూ, డౌన్లోడ్ కోసం పెట్టాలనేది.
కొన్ని, మంచి అన్న మాటలున్నాయే... అబ్బ! చాలా చెడ్డవి. వాటిని ఏ శ్టాండర్డ్స్ ప్రకారం ఎన్నుకోవాలి? ;-)
ఒక్క విషయం చెప్పి, నా సమీక్ష మొదలెడతాను. సుజ్జి గారి కవితలనున్నింటిని ఎంపిక చేసి, eBook గా మార్చి, B&G ద్వారా మరోసారి గుర్తుచేద్దామని గీతాచార్య పర్మిషన్ సంపాదించాక నాకు చేసిన మెయిల్ లో ఇద్దరం ఎవరికి వాళ్ళంగా పిక్ చేద్దాము. వాటిని ఇద్దరమూ, ఎవరికి వాళ్ళంగా రాసి కలిపి అందిద్దాము అని.
ఆశ్చర్యమేమిటంటే, ఎంపిక చేసుకున్న పదకొండూ, ఇద్దరమూ, ఒకరికి తెలియకుండా ఒకరం ఎంపిక చేసినవే. :-) ఒక్కటి కూడా మార్పు లేదు. ఆ వదిలేయబడ్డ ఒక్కటీ సమానమే. కారణాలూ దాదాపూ ఒకటే. ఆ కవిత కి వ్యాఖ్యగా గీతాచార్య రాసిన మాటలే దానికి కారణం.
ఇక సమీక్ష...
I CAN ONLY SAY THAT I FEEL EXTREMELY PROUD TO BE SELECTED TO WRITE A FEW WORDS ABOUT THIS ONE.
ఇంతకన్నా ఒక్క మాట ఎక్కువ చెప్పినా, that would be a great offence to the poetess. Its an insult for her.
A review is a sort of defense as to why read a book. This work needs no defense. Simply,
THE DEFENSE RESTS NOW.
మీకుగా మీరే మరోసారి (ఎందుకంటే కొంతమందైనా చదివే ఉంటారు. కాకపోతే ఒక్కఛోటే అన్నీ ఉంటాయనేది ఇక్కడ ఇలా అందించటానికి కారణం) చదివి, కాదు కాదు, అనుభవించి చూడండి. అలా అని రివ్యూలు అవసరంలేదా అంటారా..., కొన్ని కొన్ని సార్లు కేవలం మనకోసం రాసుకునేందుకు, మరోసారి ఆ ప్రపంచంలో విహరించటానికి అవసరం. But Sujji's books needs no such thing. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి. చదివేసెయ్యండి.
కొసమెరుపు:
B&G లోగోని మరీ అలా పెట్టినందుకు గీతాచార్య అబ్జెక్ట్ చేశారు. దానికి నా సమాధానం... That you picked her work to present, and that too as first in the series. అదే మీకా అర్హతనందించింది.
నా మాటలు నిజమో కాదో మీరే నిర్ణయిస్తారు చదివాక.
ప్రియ అయ్యంగార్
P. S. ఈ కవితలకి సమాధానం/ఎల్స్టెన్షన్/ వ్యతిరేకంగా మరో రెండు మూడు చిన్న కవితలున్నాయి. వాటిని నా బ్లాగులో అందించేందుకు అనుమతి లభించింది. Wait and see...
ఇక్కడ నుంచీ డౌన్లోడ్ చేసుకోండి
మౌనం - Straight from the Heart
ప్రోలోగ్:
Whatever their future, at the dawn of their lives, men seek a noble vision of Man's nature, and of life's potential - Ayn Rand
If anyone asks me who will let you do the things? my answer for such people is: that's not the point. The point is who will stop me?
Nothing can be reasonable or beautiful unless it's made by one central idea, and the idea sets every detail . It is integrity, and it is to follow its own truth.
The code of competence is the only system of morality that's on a gold standard.
I need no warrant for being, and no word of sanction upon my being. I am the warrant and the sanction.
Wealth is the product of man's capacity to think.
Happiness is the greatest agent of purification. It can be achieved only when one's thoughts are pure. To be pure means to follow Reason.
Itz the 105th birthday of Ayn Rand
A ll (is)
Y es (or)
N o
R eason is
A bsolute (itz)
N ever
D egradable
ఆ లెక్చర్లను వీక్షించాలంటే ఇక్కడ నొక్కండి...








